వైయ్యస్ రాజశేఖరరెడ్డి మరణానికి గల కారణాలను వెలికితీయడంలో కాంగ్రెస్ హై కమాండ్ ఆహ్లాదకరంగా వ్యవహరించుతూంది. వైయ్యస్ రాజశేఖరరెడ్డి హైకమాండ్ను ఏవిషయంలోనూ ప్రాధేయపడకుండా చక్కని పరిపాలన సాగించుచు ప్రజలందరి మన్ననలు పొందుతున్నారు. హైకమాండ్ లోని కొందరి పెద్దల సహజ అవసరాలు వైయ్యస్ ద్వారా నెరవేరడం లేదు. తమ వర్గానికి చెందిన ఏ ఎదవకైనా ఓ మంత్రి పదవి ఇప్పించుకోలేక పోయారు. హైకమాండును ఎటువంటి సలహాలు కోరకుండానే ఒంటి చేత్తో పార్టీని గెలిపించాడు. దాదాపుగా ఓ నియంత లాగా వాళ్ళ దృష్టిలో వాళ్ళు వైయ్యన్ ను భావించారు. కనుకనే వైయ్యస్ అదృశ్యవార్త విని మహదానందంగా నూతనోత్సాహంతో దు:ఖించారు.
1. వచ్చిన అవకాశం వదులుకొని మళ్ళా అధికారాన్ని జగన్ కు ఇవ్వడం హైకమాండ్ కు ఇష్టం లేదు. ఎందుకంటే జగన్ ప్రక్కన కెవిపి ఉన్నంతవరకూ అధికారం జగన్ కు ఇవ్వరు. ఎందుకంటే జగన్ కు హైకమాండ్ అంటే వా. రవి కాదు, మాయలఫకీరయిన ప్రణబ్ కాదు. కేవలం కేవీపీ రామచంద్రరావే.
2. ప్రమాదం జరగడానికి ఏవియేషన్ అధికారుల సహకారం తీసుకున్నవారు ప్రమాదం ఎలాజరిగిందో ఎంక్వైరీ చేయడానికి అష్టాచమ్మాలాగా తలాకాసేపు ధోరణిలో పరిశోధనాగేం ఆడేస్తున్నారు. ఈ పరిస్తితుల్లో ఒక వేళ జగన్ కే ముఖ్యమంత్రి పదవి ఇస్తే అతడు ఖచ్చితమైన ఎంక్వైరీ చేయించే ప్రమాదముంది. అప్పుడు తమ బండారం బట్టబయలౌతుంది. కనుక అతనికి ముఖ్యమంత్రి స్థానం ఇవ్వలేదు. భవిష్యత్తులో ఇచ్చే అవకాశంలేదు.
3. హెలీకాఫ్టర్ లో ప్రయాణిస్తున్నవారు ఏం మాట్లాడారో తెలిశాక ( అంటే ఈ ప్రమాదం జరగడానికి హైకమాండ్ కారణమనే సంగతి. లేదా ఎవరో హెలీకాఫ్టర్ ను కావాలని పాడు చేశారనే విషయం పైలెట్లు గ్రహించి ఆవిషయాన్ని ముఖ్యమంత్రితో చెప్పే సంభాషణలు ) ఆపాటికే జగన్ సియ్యంగా ఉంటే పార్టీని తొంభైశాతం దాకా చీల్చి వేరే పార్టీ పెట్టే అవకాశం ఉంది. కనుకనే జగన్ కు సియ్యంగా ఇవ్వరు.
4. రోశయ్యగారు కాబట్టి సియ్యం ప్రయాణిస్తున్న హెలీకాఫ్టర్ జాడ తెలియలేదు అని తెలియగానే టి.వి. ప్రకటన ద్వారా ఎరుకలవాళ్ళు, యానాదుల వాళ్ళు దయచేసి అడవిలోకిపోయి వెతకండి అని కోరినాడు. అదే జగన్ అయితే పోలీసులను కోరివుండేవాడు.
5. చెట్లమీద హెలీకాఫ్టర్ దిగడంవల్ల సియ్యం గారికి దెబ్బలు తగిలి ఉంటాయనే 40 ఫొటోలు తీసి దానిలో సియ్యంగారూ, ఇతరులూ ప్రాణాలతో లేరని నిర్ధారించుకుని తర్వాత శవాలను తేవడానికి ప్రయత్నం జరిగింది.
6. బహుశా జనాన్ని మాయచేయడానికి , జగన్కు జనాన్ని దూరం చెయ్యడానికి ఏదైనా అభూతకల్పనలు సృస్ఠించవచ్చు, నిందలను సృష్ఠించవచ్చు.
కాలం ఎప్పుడూ ఒక్కలా ఉండదుగదా. ఇన్నాళ్ళకు కొందరికి పరిపాలించుకునే మహదావకాశం వచ్చింది. మరో నాలుగేళ్ళు వాళ్ళు ఎంజాయ్ చేద్దామనుకుంటున్నారు.
అటువంటి వారికి ప్రజలు చేతితో చెబుతారో కాలితోచెబుతారోగానీ మంచి సమాధానం చెబుతారని ఆశిద్దాం.
Saturday, September 12, 2009
Tuesday, June 30, 2009
విషపూరితమౌతున్న తెలుగు భాష
తెలుగు భాషను గురించి ఆలోచన చేస్తుంటే చాలా భయంగా ఉంటుంది. ఎందుకంటే తెలుగు భాష అనేక విధములైన ఆటుపోట్లను ఎదుర్కొంటుంది. మనం వ్రాస్తున్నదీ , సంభాషిస్తుందీ తెలుగు కాదు. నిజానికి భారతదేశంలోని భాషలేకాదు, దాని పరిసర దేశాలలోని భాషలు కూడా ఈ రకమైన సంక్షోభంలో ఉన్నాయి. ఈ భాషలలో మృత భాష అయిన సంస్కృత భాషను బలవంతంగా, ప్రయత్న పూర్వకంగా చొప్పించ బడుతుంది. ఉదాహరణకు తెలుగు భాషను బలోపేతం చేయడమనే ప్రయత్నంలో భాగంగా సంస్కృత భాషను కొందరు పండితులు ప్రవేశపెట్టారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రచురణ అయిన ఒకటవ తరగతి తెలుగు పుస్తకం ఒకసారి చూడండి. అందులో తెలుగు పదాల కంటే సంస్కృత పదాలే ఎక్కువగా ఉన్నాయి. అవే బలవంతంగా తెలుగు పేరుతో నేర్పబడుతున్నాయి. తెలుగు భాషలో అందుబాటులో లేని పదాలను సంస్కృత భాషనుండి తెచ్చుకోవడంలో తప్పులేదు కానీ , తెలుగులో మంచి పదాలున్నప్పటికీ వాటికి బదులుగా సంస్కృత భాషలోని పదాలు వాడడమే గొప్పగా భావించబడుతుంది. తేనెలూరు తెలుగు రుచి సంస్కృతంతో సంకరమైన భాషలో ఉండదు. తెలుగు భాషాభివృద్ధికి సంస్కృత భాషా పండితులే నాయకత్వం వహించి వివిధ ఉద్యమాలు, కార్యక్రమాలు నడపడం మన దౌర్భాగ్యం.
నిజమైన తెలుగు మాట్లాడేవారికి ద్విత్వాక్షరపదాలు మాత్రమే పలుకగలరు. సంయుక్తాక్షరాలు పలుకలేరు. సంయుక్తాక్షర పదాలను కూడా అందమైన తెలుగు యాసలో విరిచి మాట్లాడగలరు. మాయాబజారు చిత్రంలో అసమదీయులు, తసమదీయులు లాగా. పూర్వకాలపు పండితులకు ఈ సంస్కృత భాషాదురభిమానం బహుశా లేకుండుటచే కాబోలు డేవిడ్ ,జోసఫ్ , జీజస్ వంటి పేర్లు కూడా దావీదు, యోసేపు ,యేసు , జోజప్ప, జేసువు ఇలా అనువదింపబడ్డాయి.
ఒకవిధంగా చూస్తే తెలుగు భాషపై ఓ దీర్ఘకాలిక కుట్ర జరిగినట్లు కన్పిస్తుంది. అది క్రమేపి బలపడుతుంది. సాధారణ ప్రజలకు ఈ విషయాలు అర్ధం కావడం కష్టం. కనుక ఓ మృతభాషాసంకలితం చేయబడినందున మన భాషలు కూడా మృత్యుకళతో ప్రకాశిస్తున్నాయి. ఇట్స్ టూ లేట్. మనమేంచెయ్యలేం. లీవిట్.
నిజమైన తెలుగు మాట్లాడేవారికి ద్విత్వాక్షరపదాలు మాత్రమే పలుకగలరు. సంయుక్తాక్షరాలు పలుకలేరు. సంయుక్తాక్షర పదాలను కూడా అందమైన తెలుగు యాసలో విరిచి మాట్లాడగలరు. మాయాబజారు చిత్రంలో అసమదీయులు, తసమదీయులు లాగా. పూర్వకాలపు పండితులకు ఈ సంస్కృత భాషాదురభిమానం బహుశా లేకుండుటచే కాబోలు డేవిడ్ ,జోసఫ్ , జీజస్ వంటి పేర్లు కూడా దావీదు, యోసేపు ,యేసు , జోజప్ప, జేసువు ఇలా అనువదింపబడ్డాయి.
ఒకవిధంగా చూస్తే తెలుగు భాషపై ఓ దీర్ఘకాలిక కుట్ర జరిగినట్లు కన్పిస్తుంది. అది క్రమేపి బలపడుతుంది. సాధారణ ప్రజలకు ఈ విషయాలు అర్ధం కావడం కష్టం. కనుక ఓ మృతభాషాసంకలితం చేయబడినందున మన భాషలు కూడా మృత్యుకళతో ప్రకాశిస్తున్నాయి. ఇట్స్ టూ లేట్. మనమేంచెయ్యలేం. లీవిట్.
Wednesday, May 6, 2009
ఉచిత సాఫ్టువేర్లు
ఆడియో, వీడియో లకు సంబంధించిన ఉచిత సాఫ్టువేర్లు అందించే వెబ్సైటు అడ్రస్సు http://www.avs4you.com/
ఏవియస్4యూ నుండి వీడియో కన్వర్టర్, ఏవియస్ వీడియో ఎడిటర్, వీడియో రీమేకర్ ద్వాగా వీడియోలోని అవసరం లేని భాగాలను కట్ చేసుకోవచ్చు. , ఆడియో కన్వర్టర్ , ఆడియో ఎడిటర్, బేకప్ తీసుకొనుటకు, రిజిష్ట్రీ క్లీనర్, డివిడి కాపీయర్, వీడియో రికార్డర్ ..తదితర ఉచిత సాఫ్టువేర్లు లభిస్తున్నాయి. ఖాళీ సమయముంటే ఎంజాయ్ చెయ్యండి
ఏవియస్4యూ నుండి వీడియో కన్వర్టర్, ఏవియస్ వీడియో ఎడిటర్, వీడియో రీమేకర్ ద్వాగా వీడియోలోని అవసరం లేని భాగాలను కట్ చేసుకోవచ్చు. , ఆడియో కన్వర్టర్ , ఆడియో ఎడిటర్, బేకప్ తీసుకొనుటకు, రిజిష్ట్రీ క్లీనర్, డివిడి కాపీయర్, వీడియో రికార్డర్ ..తదితర ఉచిత సాఫ్టువేర్లు లభిస్తున్నాయి. ఖాళీ సమయముంటే ఎంజాయ్ చెయ్యండి
Friday, April 10, 2009
రాజకీయాల్లోకి మనం ఎలా ఎంటర్ అవ్వాలి...
ప్రజాస్వామ్యమంటే ప్రజల నుండి, ప్రజల కొరకు , ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం, అంటే, అవును పైకి కన్పిస్తున్నవిధంగా ఇది ఒక్కరి చేత నిరంకుశంగా పాలింపబడడం కాదు , ప్రతి నిర్ణయం వెనుక అనేకమంది ఉన్నారు అని సంతోషించేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో మీరు కూడా ఉన్నారనే ఉద్దేశ్యంతో ఈ టపా రాస్తున్నాను.
కొన్ని విషయాలు మీరు కూడా అంగీకరిస్తారు. ప్రజల కొరకు అంటే వ్యాపారుల కొరకు లేదా ధనవంతుల కొఱకు. ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్ధి ఏమని ప్రామిస్ చేస్తాడంటే ‘ వస్తువుల ధరలు పెంచకుండా వ్యాపారులనూ, ధనవంతులనూ కంట్రోలు చేస్తానని పేదలకు వాగ్దానం చేస్తాడు, అలాగే పేదలు తిరగబడి తన్నకుండా మిమ్మల్ని కాపాడుతానని ’ వ్యాపారులకూ, ధనవంతులకూ వాగ్దానం చేస్తాడు. అయితే వ్యాపారులనూ, ధనవంతుల పక్షాన్నే ఎక్కువగా ఉంటాడు.
ప్రజల నుండి అంటే ప్రజలు ఎవరైనా ఎన్నికలలో పోటీచేయవచ్చుననుకోకండి. వాడు 5వేలో 10వేలో ధరావత్తు చెల్లించగలవాడై యుండాలి. అతడ్ని ప్రపోజ్ చేసేవాళ్ళు కూడ ఉండాలి. పదివేలున్నాయిగదాని నామినేషను వేయబోయేరు గనుక , జాగ్రత్త ఇరగదంతారు. ఎప్పుడైనా ఏదైనా టెండరు వేసివుంటే గనుక అనుభవం వచ్చివుండును. గతంలో రాచరిక పద్ధతుల ప్రకారం రాజు కొడుకు రాజయ్యేవాడు. నేటి ప్రజాస్వామ్యం ప్రకారం రాజులు, వారి వారసులూ, భూస్వాములూ, జమీందారులూ వారి ప్రాంతాలనుంచే కాకుండా దేశంలో ఎక్కడ నుంచైనా పోటీచెయ్యవచ్చునని అర్థం. నేడు చాలామంది రాజకీయాలను అపార్థం చేసుకుంటున్నారు. నేను పార్టీలో ముందునుంచీ ఉన్నానుగదా, చిరు సినిమా రిలీజుకు పోష్టర్లు కట్టానుగనుకా... ఇవి పోటీ చేయడానికి క్వాలిఫికేషన్స్ కావు.
ప్రజల చేత అంటే మనంతా మనకు నచ్చిన భూస్వామినో, ధనవంతుడినో , జమీందారునో ఓటు ద్వారా ఎంచుకోవచ్చు. కనుక లోకసత్తాలాంటి మాటల పార్టీవాళ్ళు రాజకీయాల్లోకి ప్రవేశించడం దండగ. ( డబ్బు గలవారికి సీటు ఇచ్చిఉండకపోయుంటే )
ఇది పేరుకి ప్రజాస్వామ్యమే గాని నిజంగా ప్రజా ప్రతినిధులు పరిపాలనా విషయాల్లో కలుగజేసుకోరు. నిర్ణయాన్ని పైవారికే వదిలేస్తారు. ఒక రాజు ఎడల సేవకుడు ప్రవర్తించినట్లు లొంగుబాటు ప్రదర్శిస్తారు. తమ క్రింది వాళ్ళు కూడా అలాగే ఉండాలని కోరుతూంటారు. తెలంగాళా ఇవ్వాలా వద్దా అనే నిర్ణయం సోనియాగారే చేయాలని కోరడానికి కారణం ఇదే. దేశానికి రాజు లేక రాణి సోనియా అనుకుంటే , ఆ స్థాయిలో గతంలో పోటీ పడిన పి.వి., శరద్పవార్,సంగ్మా వంటివారు దీనికి ఉదాహరణ. మన రాష్ట్రంలో వైయ్యస్సు కు డియ్యస్సు, హనుమంతు, వగైరాలు పోటీ . వీరిలో ఎవరినైనా ముఖ్యమంత్రిగా ఎంచుకొని అధికారం అప్పగించే అవకాశం సోనియా వద్ద ఎప్పుడూ ఉంటుంది. అలాగే మన జిల్లాల్లో మంత్రులుగా ఎంచుకునేందుకు ప్రతి ప్రాంతం నుండి నలుగురైదుగురుంటారు . వారిలో ఎవరో ఒకర్ని ఎంచుకునే స్వేచ్చ వైయ్యస్కు ఎప్పుడూ ఉంటుంది. అధికారం అలా అంచలంచలుగా పైకీ క్రిందికీ నిర్మాణమై యుంటుంది. ప్రతి ప్రాంతంలో ఎస్సీ,ఎస్టీ,మహిళ, మైనార్టీ, ప్రధాన కులానికిచెందిన నాయకులు ఆయా సామాజిక వర్గాలకు సంబంధించి పైస్థాయికి సంబంధించిన ఆయానాయకుల తాలూకూ ప్రాతినిధ్యం ఉండాలి. అంటే వైయస్సార్ తాలూకూ ఎస్సీ,ఎస్టీ,మహిళ, మైనార్టీ, ప్రధాన కులానికిచెందిన నాయకులు ఆయా సామాజిక వర్గాలకు సంబంధించిన వ్యక్తులూ, డియ్యస్కు సంబంధించిన ఎస్సీ,ఎస్టీ,మహిళ, మైనార్టీ, ప్రధాన కులానికిచెందిన నాయకులు ఆయా సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తులూ .... ఇలా నిర్మాణం ఉంటుంది. కాబట్టి ఆయా స్థాయీలలో ఎల్లప్పుడూ నాయకత్వంకై పోరాటం జరుగుతూ ఉంటూంది. అంటే ప్రతి నాయకుడికీ ఓ గాడ్ఫాదర్ పైస్థాయిలో ఉండాలి . కాబట్టి ఓటువేసే ప్రతివ్యక్తికి కూడా పైస్థాయిలో ఓ నాయకుడు కావాలి. అంటే మన వీధిలో లేక వార్డులో ఉన్న ఛోటా నాయకులలో ఎవర్నో ఒకర్ని మనం ఎంచుకోవాలి. అతనితో ఇలా చెప్పాలి. సార్. మీరు ఎవరికి ఓటు వెయ్యమంటే మేము వారికి వేస్తాము. మీరు ఎప్పుడు ఎ మీటేంగుకు రమ్మంటే అప్పుడు మా పని మానుకుని వస్తాము. ( దానికి పేమెంటు అతడిస్తాడు . డోంట్ వర్రీ ) మాకు ఏదైనా ప్రభుత్వసహాయం కావాల్సివచ్చినా మీరు ఇప్పించాలి. రౌడీలనుంచీ , పోలీసులనుంచి మమ్మల్ని కాపాడాలి. అని మనం ఓ అణు వొప్పందం లాంటి అగ్రిమెంట్ చేసుకోవాలి . నేనెందుకు ఓటెయ్యాలి అని ఎవరైనా నిర్లక్షంగా ప్రవర్తిస్తే వాళ్ళకే నష్టం . మనం కూడా ఓమాదిరి నాయకుడిలాగా మారాలి. మన ఇంటిప్రక్కన ఉండేవాళ్ళని బాగా మంచిచేసుకుని వాళ్ళ బ్రెయిన్ వాష్ చేసి మన కంట్రోలులో పెట్టుకోవాలి . కనీసం నలుగురైదుగురుతో ఓజట్టు కడితే తద్వారా మన వీధి నాయకుడి నుంచి మంచి గౌరవం లాభం పొందవచ్చు. ఇది ఒకటవ రాజకీయ పాఠం. ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి వ్యాఖ్యానంతో సంప్రదించండి.
సదా మీ సేవలో ,
ఇట్లు,
మీ ఏరియా రింగ్ మాస్టర్.
కొన్ని విషయాలు మీరు కూడా అంగీకరిస్తారు. ప్రజల కొరకు అంటే వ్యాపారుల కొరకు లేదా ధనవంతుల కొఱకు. ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్ధి ఏమని ప్రామిస్ చేస్తాడంటే ‘ వస్తువుల ధరలు పెంచకుండా వ్యాపారులనూ, ధనవంతులనూ కంట్రోలు చేస్తానని పేదలకు వాగ్దానం చేస్తాడు, అలాగే పేదలు తిరగబడి తన్నకుండా మిమ్మల్ని కాపాడుతానని ’ వ్యాపారులకూ, ధనవంతులకూ వాగ్దానం చేస్తాడు. అయితే వ్యాపారులనూ, ధనవంతుల పక్షాన్నే ఎక్కువగా ఉంటాడు.
ప్రజల నుండి అంటే ప్రజలు ఎవరైనా ఎన్నికలలో పోటీచేయవచ్చుననుకోకండి. వాడు 5వేలో 10వేలో ధరావత్తు చెల్లించగలవాడై యుండాలి. అతడ్ని ప్రపోజ్ చేసేవాళ్ళు కూడ ఉండాలి. పదివేలున్నాయిగదాని నామినేషను వేయబోయేరు గనుక , జాగ్రత్త ఇరగదంతారు. ఎప్పుడైనా ఏదైనా టెండరు వేసివుంటే గనుక అనుభవం వచ్చివుండును. గతంలో రాచరిక పద్ధతుల ప్రకారం రాజు కొడుకు రాజయ్యేవాడు. నేటి ప్రజాస్వామ్యం ప్రకారం రాజులు, వారి వారసులూ, భూస్వాములూ, జమీందారులూ వారి ప్రాంతాలనుంచే కాకుండా దేశంలో ఎక్కడ నుంచైనా పోటీచెయ్యవచ్చునని అర్థం. నేడు చాలామంది రాజకీయాలను అపార్థం చేసుకుంటున్నారు. నేను పార్టీలో ముందునుంచీ ఉన్నానుగదా, చిరు సినిమా రిలీజుకు పోష్టర్లు కట్టానుగనుకా... ఇవి పోటీ చేయడానికి క్వాలిఫికేషన్స్ కావు.
ప్రజల చేత అంటే మనంతా మనకు నచ్చిన భూస్వామినో, ధనవంతుడినో , జమీందారునో ఓటు ద్వారా ఎంచుకోవచ్చు. కనుక లోకసత్తాలాంటి మాటల పార్టీవాళ్ళు రాజకీయాల్లోకి ప్రవేశించడం దండగ. ( డబ్బు గలవారికి సీటు ఇచ్చిఉండకపోయుంటే )
ఇది పేరుకి ప్రజాస్వామ్యమే గాని నిజంగా ప్రజా ప్రతినిధులు పరిపాలనా విషయాల్లో కలుగజేసుకోరు. నిర్ణయాన్ని పైవారికే వదిలేస్తారు. ఒక రాజు ఎడల సేవకుడు ప్రవర్తించినట్లు లొంగుబాటు ప్రదర్శిస్తారు. తమ క్రింది వాళ్ళు కూడా అలాగే ఉండాలని కోరుతూంటారు. తెలంగాళా ఇవ్వాలా వద్దా అనే నిర్ణయం సోనియాగారే చేయాలని కోరడానికి కారణం ఇదే. దేశానికి రాజు లేక రాణి సోనియా అనుకుంటే , ఆ స్థాయిలో గతంలో పోటీ పడిన పి.వి., శరద్పవార్,సంగ్మా వంటివారు దీనికి ఉదాహరణ. మన రాష్ట్రంలో వైయ్యస్సు కు డియ్యస్సు, హనుమంతు, వగైరాలు పోటీ . వీరిలో ఎవరినైనా ముఖ్యమంత్రిగా ఎంచుకొని అధికారం అప్పగించే అవకాశం సోనియా వద్ద ఎప్పుడూ ఉంటుంది. అలాగే మన జిల్లాల్లో మంత్రులుగా ఎంచుకునేందుకు ప్రతి ప్రాంతం నుండి నలుగురైదుగురుంటారు . వారిలో ఎవరో ఒకర్ని ఎంచుకునే స్వేచ్చ వైయ్యస్కు ఎప్పుడూ ఉంటుంది. అధికారం అలా అంచలంచలుగా పైకీ క్రిందికీ నిర్మాణమై యుంటుంది. ప్రతి ప్రాంతంలో ఎస్సీ,ఎస్టీ,మహిళ, మైనార్టీ, ప్రధాన కులానికిచెందిన నాయకులు ఆయా సామాజిక వర్గాలకు సంబంధించి పైస్థాయికి సంబంధించిన ఆయానాయకుల తాలూకూ ప్రాతినిధ్యం ఉండాలి. అంటే వైయస్సార్ తాలూకూ ఎస్సీ,ఎస్టీ,మహిళ, మైనార్టీ, ప్రధాన కులానికిచెందిన నాయకులు ఆయా సామాజిక వర్గాలకు సంబంధించిన వ్యక్తులూ, డియ్యస్కు సంబంధించిన ఎస్సీ,ఎస్టీ,మహిళ, మైనార్టీ, ప్రధాన కులానికిచెందిన నాయకులు ఆయా సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తులూ .... ఇలా నిర్మాణం ఉంటుంది. కాబట్టి ఆయా స్థాయీలలో ఎల్లప్పుడూ నాయకత్వంకై పోరాటం జరుగుతూ ఉంటూంది. అంటే ప్రతి నాయకుడికీ ఓ గాడ్ఫాదర్ పైస్థాయిలో ఉండాలి . కాబట్టి ఓటువేసే ప్రతివ్యక్తికి కూడా పైస్థాయిలో ఓ నాయకుడు కావాలి. అంటే మన వీధిలో లేక వార్డులో ఉన్న ఛోటా నాయకులలో ఎవర్నో ఒకర్ని మనం ఎంచుకోవాలి. అతనితో ఇలా చెప్పాలి. సార్. మీరు ఎవరికి ఓటు వెయ్యమంటే మేము వారికి వేస్తాము. మీరు ఎప్పుడు ఎ మీటేంగుకు రమ్మంటే అప్పుడు మా పని మానుకుని వస్తాము. ( దానికి పేమెంటు అతడిస్తాడు . డోంట్ వర్రీ ) మాకు ఏదైనా ప్రభుత్వసహాయం కావాల్సివచ్చినా మీరు ఇప్పించాలి. రౌడీలనుంచీ , పోలీసులనుంచి మమ్మల్ని కాపాడాలి. అని మనం ఓ అణు వొప్పందం లాంటి అగ్రిమెంట్ చేసుకోవాలి . నేనెందుకు ఓటెయ్యాలి అని ఎవరైనా నిర్లక్షంగా ప్రవర్తిస్తే వాళ్ళకే నష్టం . మనం కూడా ఓమాదిరి నాయకుడిలాగా మారాలి. మన ఇంటిప్రక్కన ఉండేవాళ్ళని బాగా మంచిచేసుకుని వాళ్ళ బ్రెయిన్ వాష్ చేసి మన కంట్రోలులో పెట్టుకోవాలి . కనీసం నలుగురైదుగురుతో ఓజట్టు కడితే తద్వారా మన వీధి నాయకుడి నుంచి మంచి గౌరవం లాభం పొందవచ్చు. ఇది ఒకటవ రాజకీయ పాఠం. ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి వ్యాఖ్యానంతో సంప్రదించండి.
సదా మీ సేవలో ,
ఇట్లు,
మీ ఏరియా రింగ్ మాస్టర్.
Wednesday, March 11, 2009
నవకవిత- సరదాపాట – 9వ తరగతి విద్యార్ధి పరిశీలన
( శ్రీశ్రీ రాసిన ‘నవ కవిత’కు జరుక్ శాస్త్రి రాసిన పేరడీ ‘ సరదా పాట ’ 9వ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో ఉంది. ‘ నవ కవిత ’ ( శ్రీశ్రీ ) ను, ‘ సరదా పాట ’ ( జరుక్ శాస్త్రి ) ను తులనాత్మక పరిశీలన కోసం 9వ తరగతి విద్యార్ధుల దృష్టిలో పెడితే - ఎం. వెంకటేష్ అనే విద్యార్ధి స్పందనే ఈ వ్యాసం ) - సం.
శ్రీశ్రీ నవకవిత మనకు గుండెల్లో చైతన్యాన్ని ప్రసరిస్తుంది. జరుక్ శాస్త్రి రాసిన సరదా పాట వింటుంటే నవకవిత దగ్గర పనికిరాని కవితలా అనిపిస్తుంది. శ్రీశ్రీ రాసిన నవకవిత ఎంతో ఆసక్తికరంగా ఉంటే జరుక్ శాస్త్రి రాసిన పేరడీ సరదాపాట – శ్రీశ్రీ రాసిన నవకవితను ఎగతాళి చేసింది. శ్రీశ్రీ రాసిన నవకవిత వింటుంటే ఒక విధమైన కదలికల్ని ఇస్తుంది. జరుక్ శాస్త్రి రాసిన పేరడీ వింటుంటే చెడ్డ కవితలా అనిపిస్తుంది.
శ్రీశ్రీ నవకవితకు సింధూరం తీసుకుంటే జరుక్ శాస్త్రి ఆవకాయ , పెసరప్పడం సరదా పాటకు తీసుకున్నారు. సింధూరం ఎర్రగా అన్నిటికన్నా ప్రాముఖ్యం కలిగి ఉంటుంది. అది ఉదయించే సూర్యునికి చిహ్నం .అలాంటి సింధూరాన్ని శ్రీశ్రీ నవకవితకు తీసుకొని ఆకవితకు ప్రాముఖ్యం కలుగజేయాలనుకున్వాడు. జరుక్ శాస్త్రి ఆవకాయ , పెసరప్పడం తీసుకున్నాడు. ఈయన రాసినవి తిండిపోతు ఆలోచనలను పెంచుతుంది.
జరుక్ శాస్త్రి సరదాపాట ద్వారా తెలిసిందేమిటంటే- శ్రీశ్రీని చులకనగా చేయడం. శ్రీశ్రీ నవకవిత జీవితానికి ఉపయోగపడుతుంది. జరుక్ రాసిన పేరడీని ఎవరూ పట్టించుకోరు.
నవకవితకు ఎగతాళిగా ,చులకనగా జరుక్ శాస్త్రి రాశాడు. ఇటువంటి కవితలను రాయడానికి జరుక్ శాస్త్రికి ఎలా బుద్ధి పుట్టింది? పులి చంపిన లేడి నెత్తురు శ్రీశ్రీ నవకవితకు తీసుకుంటే జరుక్ తెగిపోయిన పాత చెప్పులూ, పిచ్చోడి ప్రతాపం కోపం సరదాపాటకు సామానులుగా తీసుకున్నాడు. పులిచంపిన లేడి నెత్తురు పులిమీద కోపంతో ఉంటుంది. జరుక్ సరదాపాట పిచ్చోడి వాగుడులాగుంది. కాబట్టి మనం వాటిని తెగిపోయిన పాతచెప్పుల్లా బయటకు పారవేయాలి. పిచ్చోడు తన పరిధిలో తాను నడుచుకోలేడు. అలాంటి వాడి కోపం దేనికి పనికివస్తుంది? పిచ్చోడిని అందరూ పట్టించుకోరు. అదేవిధంగా జరుక్ శాస్త్రిని కూడా.
శ్రీశ్రీ కవిత వినడానికి చురుక్కుమంటుంది. ఇంకా వినాలనిపిస్తుంది. జరుక్ పేరడీ చెత్తగా ఉంటుంది. నవకవితకు శ్రీశ్రీ రుద్రాళిక, నయనజ్వాలిక, కలకత్తా కాళిక నాలిక తీసుకుంటే- జరుక్ శాస్త్రి వైజాగ్ లో కారాకిళ్ళీ సామానుగా తీసుకున్నాడు. రుద్రమదేవి కళ్ళల్లో మంటలు దుర్మార్గుల్ని చీల్చినంత వేగంగా ఉంటాయి. కలకత్తా కాళికా దేవి యొక్క నాలిక శత్రువుల్ని చీల్చగలిగే సామర్ధ్యం కలిగిఉంటుంది. వాటిని త్రోసి, ఉల్లంఘించి జరుక్ శాస్త్రి వైజాగ్ లో కారాకిళ్ళీ సామానులుగా తీనుకున్నాడు. వైజాగ్ లో కారాకిళ్ళీ ఎలా ఉంటుందో నాకు తెలియదుగానీ కిళ్ళీ అనేది ఒక చెడు వ్యసనమని తెలుసు.
శ్రీశ్రీ నవకవిత పిల్లలను ఉత్తేజపరచి, మంచివారుగా మారాలని చెబుతుంటే , సరదాపాట పిల్లలకు చెడ్డ భావాలను చెబుతుంది.. సరదాపాట అంటే సరదాగా మనసు వికసించేలా ఉండాలి కానీ ; ఈ సరదాపాట ఒకరిని ఎగతాళిచేసి రాసి, వారిపై చులకన భావం చూపింది.
శ్రీరంగం శ్రీనివాసరావు – ఘాటెక్కిన గంథక ధూమం, పోటెత్తిన సప్తసముద్రాలు నవకవితకు తీసుకున్నాడు. జరుక్ తుప్పుపట్టిన మోటారు చక్రం, తగ్గించిన చిమ్నీ దీపం తీనుకున్నాడు. ఘాటెక్కిన గంధక ధూమం చూస్తే దానికి చాలా శక్తి ఉంటుంది. ఏడు సముద్రాలు పోటెత్తినప్పుడు చూస్తే ఉప్పొంగి కనిపిస్తుంది. అలాంటి వాటిని శ్రీశ్రీ నవకవితకు తీసికొని దుర్మార్గులను భయాందోళనలకు గురిచేయాలనుకున్నాడు. అలాంటివాటిని ప్రక్కన పెట్టి జరుక్ శాస్త్రి తుప్పుపట్టే మోటారు చక్రం తీసుకొని ఏమిచెయ్యాలనుకున్నాడు? పిల్లలను భవిష్యత్తులో బాగు చెయ్యాలని లేదా?
శ్రీశ్రీ – వికశించిన విద్యుత్తేజం నవకవితకు తీసుకున్నాడు. విద్యుత్తు వేగం వికశించినప్పుడు కళ్ళకు ఒక విధమైన చైతన్యం కలుగుతుంది. అలాంటి వాటిని విడిచి జరుక్ శాస్త్రి మహ ఊరిన రంపప్పొట్టు సామానుగా తీసుకున్నాడు. రంపప్పొట్టు మహ ఊరినప్పుడు చెడువాసన వస్తుంది. అలాంటి రంపప్పొట్టు దేనికి పనికివస్తుంది . అందుకే అతని కవితలు కూడా మహ ఊరిన రంపప్పొట్టులా చెడుగా ఉన్నాయి. కవితలు అంటే మనసుకు వికాసాన్నీ , ఆనందాన్నీ కలిగించాలి.
శ్రీశ్రీ చెలరేగిన జనసమ్మర్ధం నవకవితకు కోరుకుంటే జరుక్ శాస్త్రి రాసిన సరదాపాటకు విసిరేసిన విస్తరి మెతుకులు వాడారు. శ్రీశ్రీ చెలరేగిన జనసమ్మర్ధాన్ని తీసుకొని ప్రజలను చలరేగించాలని కోరాడు. కానీ వాటిని తిరస్కరించి జరుక్ పనికిరాని విస్తరి మెతుకులు వాడాడు. ఇవి దేనికి పనికివస్తాయి?
శ్రీశ్రీ మార్చేదీ మార్పించేది అని వ్రాసి ప్రజలను కదిలించాలని ఆలోచించాడు. దానికి బదులుగా జరుక్ చచ్చేది లాభంలేనిది ఈజన్మలో పనికిరానిది అని చివరలో తేల్చిచెప్పిన సరదాపాట పిల్లలకు ఎలా పనికివస్తుంది? ఈ జన్మకేకాదు ఏజన్మలోకైనా పనికరాదని చెప్పవచ్చు. శ్రీశ్రీ పెనునిద్దుర వదిలించేది, మునుముందుకు నడిపించేది , పరిపూర్ణపు బ్రతుకిచ్చేది అని రాసాడు. అంటే నిద్రపోతున్న బద్ధకస్తులను పెనునిద్దురనుంచి మేలుకొమ్మని , విశ్వాన్ని చూడమని చెబుతున్నాడు. అలాంటి వారిని మునుముందుకు నడిపించాలనే కోరికతే రాసాడు. ఇలా చేస్తే పరిపూర్ణ బ్రతుకు వస్తుందని , మూర్ఖులను చీల్చగలిగే శక్తికలుగుతుందని అభిప్రాయం.
డాక్టర్. ఎన్.గోపి 9వ తరగతి పాఠ్యపుస్తకానికి సంపాదకులుగా ఉండి, జరుక్ మీద అభిమానమో లేదా ద్వేషమో ఈ కవిత – సరదాపాట ను పిల్లలకు అందించారు. శ్రీశ్రీ – మీదే మీదే సమస్త విశ్వం – మీరే మీరే భాగ్యవిధాతలు అని సమస్త విశ్వాన్ని పిల్లల చేతుల్లో పెట్టారు.
జరుక్ రాసిన సరదాపాట ఎన్. గోపి గారు మాచేతుల్లో పెట్టి ఏమి చేయాలనుకున్నారు?
-ఉపాధ్యాయ సౌజన్యంతో
శ్రీశ్రీ నవకవిత మనకు గుండెల్లో చైతన్యాన్ని ప్రసరిస్తుంది. జరుక్ శాస్త్రి రాసిన సరదా పాట వింటుంటే నవకవిత దగ్గర పనికిరాని కవితలా అనిపిస్తుంది. శ్రీశ్రీ రాసిన నవకవిత ఎంతో ఆసక్తికరంగా ఉంటే జరుక్ శాస్త్రి రాసిన పేరడీ సరదాపాట – శ్రీశ్రీ రాసిన నవకవితను ఎగతాళి చేసింది. శ్రీశ్రీ రాసిన నవకవిత వింటుంటే ఒక విధమైన కదలికల్ని ఇస్తుంది. జరుక్ శాస్త్రి రాసిన పేరడీ వింటుంటే చెడ్డ కవితలా అనిపిస్తుంది.
శ్రీశ్రీ నవకవితకు సింధూరం తీసుకుంటే జరుక్ శాస్త్రి ఆవకాయ , పెసరప్పడం సరదా పాటకు తీసుకున్నారు. సింధూరం ఎర్రగా అన్నిటికన్నా ప్రాముఖ్యం కలిగి ఉంటుంది. అది ఉదయించే సూర్యునికి చిహ్నం .అలాంటి సింధూరాన్ని శ్రీశ్రీ నవకవితకు తీసుకొని ఆకవితకు ప్రాముఖ్యం కలుగజేయాలనుకున్వాడు. జరుక్ శాస్త్రి ఆవకాయ , పెసరప్పడం తీసుకున్నాడు. ఈయన రాసినవి తిండిపోతు ఆలోచనలను పెంచుతుంది.
జరుక్ శాస్త్రి సరదాపాట ద్వారా తెలిసిందేమిటంటే- శ్రీశ్రీని చులకనగా చేయడం. శ్రీశ్రీ నవకవిత జీవితానికి ఉపయోగపడుతుంది. జరుక్ రాసిన పేరడీని ఎవరూ పట్టించుకోరు.
నవకవితకు ఎగతాళిగా ,చులకనగా జరుక్ శాస్త్రి రాశాడు. ఇటువంటి కవితలను రాయడానికి జరుక్ శాస్త్రికి ఎలా బుద్ధి పుట్టింది? పులి చంపిన లేడి నెత్తురు శ్రీశ్రీ నవకవితకు తీసుకుంటే జరుక్ తెగిపోయిన పాత చెప్పులూ, పిచ్చోడి ప్రతాపం కోపం సరదాపాటకు సామానులుగా తీసుకున్నాడు. పులిచంపిన లేడి నెత్తురు పులిమీద కోపంతో ఉంటుంది. జరుక్ సరదాపాట పిచ్చోడి వాగుడులాగుంది. కాబట్టి మనం వాటిని తెగిపోయిన పాతచెప్పుల్లా బయటకు పారవేయాలి. పిచ్చోడు తన పరిధిలో తాను నడుచుకోలేడు. అలాంటి వాడి కోపం దేనికి పనికివస్తుంది? పిచ్చోడిని అందరూ పట్టించుకోరు. అదేవిధంగా జరుక్ శాస్త్రిని కూడా.
శ్రీశ్రీ కవిత వినడానికి చురుక్కుమంటుంది. ఇంకా వినాలనిపిస్తుంది. జరుక్ పేరడీ చెత్తగా ఉంటుంది. నవకవితకు శ్రీశ్రీ రుద్రాళిక, నయనజ్వాలిక, కలకత్తా కాళిక నాలిక తీసుకుంటే- జరుక్ శాస్త్రి వైజాగ్ లో కారాకిళ్ళీ సామానుగా తీసుకున్నాడు. రుద్రమదేవి కళ్ళల్లో మంటలు దుర్మార్గుల్ని చీల్చినంత వేగంగా ఉంటాయి. కలకత్తా కాళికా దేవి యొక్క నాలిక శత్రువుల్ని చీల్చగలిగే సామర్ధ్యం కలిగిఉంటుంది. వాటిని త్రోసి, ఉల్లంఘించి జరుక్ శాస్త్రి వైజాగ్ లో కారాకిళ్ళీ సామానులుగా తీనుకున్నాడు. వైజాగ్ లో కారాకిళ్ళీ ఎలా ఉంటుందో నాకు తెలియదుగానీ కిళ్ళీ అనేది ఒక చెడు వ్యసనమని తెలుసు.
శ్రీశ్రీ నవకవిత పిల్లలను ఉత్తేజపరచి, మంచివారుగా మారాలని చెబుతుంటే , సరదాపాట పిల్లలకు చెడ్డ భావాలను చెబుతుంది.. సరదాపాట అంటే సరదాగా మనసు వికసించేలా ఉండాలి కానీ ; ఈ సరదాపాట ఒకరిని ఎగతాళిచేసి రాసి, వారిపై చులకన భావం చూపింది.
శ్రీరంగం శ్రీనివాసరావు – ఘాటెక్కిన గంథక ధూమం, పోటెత్తిన సప్తసముద్రాలు నవకవితకు తీసుకున్నాడు. జరుక్ తుప్పుపట్టిన మోటారు చక్రం, తగ్గించిన చిమ్నీ దీపం తీనుకున్నాడు. ఘాటెక్కిన గంధక ధూమం చూస్తే దానికి చాలా శక్తి ఉంటుంది. ఏడు సముద్రాలు పోటెత్తినప్పుడు చూస్తే ఉప్పొంగి కనిపిస్తుంది. అలాంటి వాటిని శ్రీశ్రీ నవకవితకు తీసికొని దుర్మార్గులను భయాందోళనలకు గురిచేయాలనుకున్నాడు. అలాంటివాటిని ప్రక్కన పెట్టి జరుక్ శాస్త్రి తుప్పుపట్టే మోటారు చక్రం తీసుకొని ఏమిచెయ్యాలనుకున్నాడు? పిల్లలను భవిష్యత్తులో బాగు చెయ్యాలని లేదా?
శ్రీశ్రీ – వికశించిన విద్యుత్తేజం నవకవితకు తీసుకున్నాడు. విద్యుత్తు వేగం వికశించినప్పుడు కళ్ళకు ఒక విధమైన చైతన్యం కలుగుతుంది. అలాంటి వాటిని విడిచి జరుక్ శాస్త్రి మహ ఊరిన రంపప్పొట్టు సామానుగా తీసుకున్నాడు. రంపప్పొట్టు మహ ఊరినప్పుడు చెడువాసన వస్తుంది. అలాంటి రంపప్పొట్టు దేనికి పనికివస్తుంది . అందుకే అతని కవితలు కూడా మహ ఊరిన రంపప్పొట్టులా చెడుగా ఉన్నాయి. కవితలు అంటే మనసుకు వికాసాన్నీ , ఆనందాన్నీ కలిగించాలి.
శ్రీశ్రీ చెలరేగిన జనసమ్మర్ధం నవకవితకు కోరుకుంటే జరుక్ శాస్త్రి రాసిన సరదాపాటకు విసిరేసిన విస్తరి మెతుకులు వాడారు. శ్రీశ్రీ చెలరేగిన జనసమ్మర్ధాన్ని తీసుకొని ప్రజలను చలరేగించాలని కోరాడు. కానీ వాటిని తిరస్కరించి జరుక్ పనికిరాని విస్తరి మెతుకులు వాడాడు. ఇవి దేనికి పనికివస్తాయి?
శ్రీశ్రీ మార్చేదీ మార్పించేది అని వ్రాసి ప్రజలను కదిలించాలని ఆలోచించాడు. దానికి బదులుగా జరుక్ చచ్చేది లాభంలేనిది ఈజన్మలో పనికిరానిది అని చివరలో తేల్చిచెప్పిన సరదాపాట పిల్లలకు ఎలా పనికివస్తుంది? ఈ జన్మకేకాదు ఏజన్మలోకైనా పనికరాదని చెప్పవచ్చు. శ్రీశ్రీ పెనునిద్దుర వదిలించేది, మునుముందుకు నడిపించేది , పరిపూర్ణపు బ్రతుకిచ్చేది అని రాసాడు. అంటే నిద్రపోతున్న బద్ధకస్తులను పెనునిద్దురనుంచి మేలుకొమ్మని , విశ్వాన్ని చూడమని చెబుతున్నాడు. అలాంటి వారిని మునుముందుకు నడిపించాలనే కోరికతే రాసాడు. ఇలా చేస్తే పరిపూర్ణ బ్రతుకు వస్తుందని , మూర్ఖులను చీల్చగలిగే శక్తికలుగుతుందని అభిప్రాయం.
డాక్టర్. ఎన్.గోపి 9వ తరగతి పాఠ్యపుస్తకానికి సంపాదకులుగా ఉండి, జరుక్ మీద అభిమానమో లేదా ద్వేషమో ఈ కవిత – సరదాపాట ను పిల్లలకు అందించారు. శ్రీశ్రీ – మీదే మీదే సమస్త విశ్వం – మీరే మీరే భాగ్యవిధాతలు అని సమస్త విశ్వాన్ని పిల్లల చేతుల్లో పెట్టారు.
జరుక్ రాసిన సరదాపాట ఎన్. గోపి గారు మాచేతుల్లో పెట్టి ఏమి చేయాలనుకున్నారు?
-ఉపాధ్యాయ సౌజన్యంతో
Sunday, January 18, 2009
మార్పు
Monday, December 29, 2008
పొదుపు
Subscribe to:
Posts (Atom)









