Dec 4, 2011

శ్రీరామరాజ్యం సినిమాలో ఓ వింత




శ్రీరామరాజ్యంలో శ్రీరాముడు , ఆయన సోదరులు, ఆయన కూమారులు, 




మామగారైన జనకుడు, ఆంజనేయుడు , ఒక గూఢచారి మాత్రము వైష్ణవ 




నామాలను నొసటన ధరించగా ,  గురువులు , ప్రజలు అంతా శైవ 




సాంప్రదాయం ప్రకారం అడ్డబొట్లు ధరించివున్నారు. ప్రజలందరినుండి 




రాజకుటుంబము మాత్రమే ఎందుకని వేరయింది. సినిమా అంతటిలో 




ఎక్కడా ఒక్క శివలింగమైనా కనిపించకపోవడానికి కారణం ఏమిటి







4 comments:

అడ్డనామాలు పెట్టడానికి చాలా మందికి చేతనౌను. 'ఎగ' నామాలు పెట్టడం కొంతమంది వల్లే సాధ్యమౌనని దీని ద్వారా బాపూ గారు చెప్పక నె చెబుతున్నారు అని జిలేబి నిర్వచనం దీనికి. జస్ట్ కిడ్దింగ్!

శ్రీ రాముని కాలానికి ముందే శైవం వుండేది అనడానికి ఇది నిదర్శనం అనుకోవచ్చు. వైష్ణవం అంగీకరింప బడడానికి చాలా కాలం పట్టి వుండవచ్చు అనుకుంటాను ! రాజ పరంపరలు ఆ వైష్ణవానికి నాందీ పలికిన వారేమో !

ఇదే మరి ! సినిమా జ్ఞానమంటే

:) Good observation! మొన్నీ మధ్య అదుర్స్ సినిమా లో .. 'ఏమయ్యా శాస్త్రీ..చారీ ' అని పిలుచుకుంటూ, కొందరికి వైష్ణవ నామాలు,శైవ పేర్లు.. అదంటే కాలక్షేపం కమర్షియల్ చిత్రం అనుకోండి.

అందరికి వందనాలు.
జిలేబిగారు చెప్పినట్లుగా మనదేశంలో ప్రాచీనకాలంలో బాగా ప్రాచుర్యంలో ఉన్న శైవం ప్రజల జీవితాలతో మమేకమైయుండగా , వైష్ణవులైన ఆర్యుల రాక తర్వాత వారి శుద్ధి పద్ధతులు అవగాహన చేసుకోవడంలో శ్రామిక వృత్తుల వారు వెనుకబడి యున్నందువలననే సీతాదేవిని వారు అనుమానించి వుంటారు అని నా అభిప్రాయం

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...