ఏడేళ్ళ బాలికను చెరిచి చంపిన ఘటనపై కొలంబియాలో ఆగ్రహం

Dec 9, 2016



కొలంబియా రాజధానీ నగరం బొగోటాలో ఆదివారం చెరిచి చంపబడిన ఏడేళ్ళ పేద బాలికను ఖననం చేశారు. యులియానా సంబోని శవం ఒక విలాసవంతమైన అంకణం ( అపార్టుమెంటు) లో దొరికింది. ఆమెను గొంతు పిసికి చంపివుంటారని భావిస్తున్నారు. పోలీసులు ఒక ధనిక కుటుంబానికి చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ హత్య దేశంలోని పిల్లలపై జరిగే అత్యాచారలపైన, సాంఘీక అసమానతలపైన ప్రజలు కోపంతో రగిలిపోతున్నారు. అధ్యక్షుడు శ్రీ జుయన్ను మానుయల్లు శాంత్రోజు దీనిని ఖండించారు.



బొగోటా లోని  కార్మికుల నివాసాలలోగల తన ఇంటివద్ద యులియానా సంబోని ఆడుకుంటుండగా బూడిదరంగు వ్యానులో వచ్చిన వ్యక్తి  ఆ అమ్మాయిని బలవంతంగా వ్యానులో ఎక్కించుకొని పోయాడు.
కొన్ని గంటల తర్వాత ఆమె శరీరం హింసించి, చెరచబడిన గుర్తులతో  ఒక ధనవంతుల అంకణంలో లభించింది. పారిపోయిన ఆ అంకణం యొక్క 38 యేళ్ళ యజమాని తరువాత సారాయి, కొకెయిన్ వంటి మత్తుపదార్ధాలను ఎక్కువ మోతాదులో తీసుకొని, ఆసుపత్రిలో చేరాడు. అతణ్ణి అదుపులోకి తీసుకొని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.


ఆ మరునాడు వందలాది ప్రజలు బొగోటా లోని ఓ పార్కులో  కొవ్వొత్తులతో గుమిగూడి తమ సంతాపాన్ని తెలిపారు. స్త్రీ హక్కుల సంఘాలు స్త్రీలను కామహింసలనుండి ప్రభుత్వము కాపాడాలని కోరారు.
Share this article :

0 comments:

Speak up your mind

Tell us what you're thinking... !

 
Support us : APTF257 || మాష్టారు || Ajit Kumar ||
Copyright © 2013. మాష్టారు - All Rights Reserved
Designed by The Masters Mind || Published by Divine Spirit || Tech Gnan ||
Proudly powered by Ajit Kumar || On Facebook || On Twitter ||