అమెరికా ఇండియా దేశాల మధ్య అణు ఒప్పందం జరగాలని, వద్దని రెండు విధాలుగా ప్రజలు ఆలోచిస్తున్నారు. ఈ విషయం గురించి మీరు ఏమనుకుంటున్నారు?
నాకు తెలిసినంతవరకూ అమెరికా పాకీస్థాన్ వైపూ, రష్యా ఇండియా వైపూ ఉండేవి. ఇండియా అలీనదేశాలకు నాయకత్వం వహిస్తుంది.ఇప్పుడు అమెరికా మన విద్యుత్ అవసరాలను కోసం అణువిద్యుత్తు తయారుచేసుకునే పరిజ్ఞానాన్ని మనకు ఇవ్వడానికి తహతహ లాడుతుంది. ఎందుకు?
ఈ అణు ఒప్పందం అమలు 4 దశలుగా జరగాలి. 1.అణుఇంధనాన్ని సప్లై చేసే గ్రూపు ( NSG ) మన దేశంతో చర్చించి అంగీకారం తెల్పాలి. 2.అంతర్జాతీయ అణు సంస్ధ ( IAEA ) ) మన దేశంతో చర్చించి అంగీకారం తెల్పాలి. ( ఇప్పుడు జరగబోయే సీను ఇదే.)3. భారతదేశ కేంద్ర ప్రభుత్వం అమెరికా షరతులకు అంగీకరించాలి. 4. పై మూడు ఒప్పందాలను పరిశీలించాక అమెరికా పార్లమెంటు అంగీకరించి చట్టం చెయ్యాలి.
ఇప్పటివరకూ 25 దేశాలతో అమెరికాకు అణు ఒప్పందం కుదిరింది. వాటిల్లో కమ్యూనిష్టులు అభిమానించే చైనా దేశం కూడా ఉంది. మరి కమ్యూనిష్టులు ఈ అణు ఒప్పందాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఎందుకంటే ఆ 25 పెద్దదేశాలు సంతకాలు చేసి అంగీకారం తెల్పిన తర్వాత 2007లో Hyde చట్టాన్ని అమెరికా తయారుచేసి అమెరికా కాంగ్రెస్ లోని రెండు సభలూ ఆమోదించింనాయి, అమెరికా ప్రసిడెంటు జార్జి బుష్, కూడా సంతకం చేసాడు. దానికంటే ముందు 2005 జూలై నెలలో మన ప్రధాని అమెరికా పర్యటనకు వెళ్ళినప్పుడు ఈ అణు ఒప్పందం విషయం బుష్ ప్రతిపాదించాడు. 2006 మార్చి లో ఢిల్లీలో భారత ప్రధాని మనమోహన్ సింగ్, అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ పౌర అణు సహకార ఒప్పందంపై సంతకాలు చేశారు. మనం చాలా ఆనందించాం, ఆశ్చర్యపోయాం ఎందుకు ఆయాచితంగా ఈ వరాన్ని ప్రసాదిస్తున్నారా అని. తర్వాత తెల్సిందేమిటంటే ఇరాన్ దేశం నుండి పాకీస్థాన్ , ఇండియా మీదుగా చైనా దేశానికి గ్యాసు పైపు లైను నిర్మించి , తక్కువ ధరకు గ్యాసు మనకు లభించేలాగా, తక్కువ ఖర్చుతో మనం విద్యుత్తు ఉత్పత్తి చేసుకోగలిగేలాగా చైనా, పాకీస్థాన్ , ఇరాన్ లతో మనం ఒక ఒప్పందం చేసుకొని ఉన్నాం. ఈ ఒప్పందాన్ని చెడగొట్టాలని అమెరికా ఎత్తుగడ పన్నింది. పాకీస్థాన్ ఎటూ అమెరికా మాట కాదనదు, మరి మనల్ని ఒప్పించాలంటే ఈ ఉచిత అణువిజ్ఞానబదలాయింపు అనే అస్త్రం ద్వారా మనల్ని పడగొట్టింది. ఇరాన్ దేశానికి వ్యతిరేకంగా మనచేత ఐక్యరాజ్యసమితిలో ఓటు వేయించింది. వెనుకబడిన దేశాలతోఒప్పందంగా భావించి, Hyde చట్టాన్ని దీనితో జతచేశారు.Hyde చట్టం ప్రకారం మనం ఇతర దేశాలతో చర్చలు జరపాలంటే అమెరికా అధ్యక్షుని అనుమతి తీసుకోవాలి. అమెరికా అధ్యక్షుడు ఏసమయంలో అయినా తన ఒప్పందాన్ని రద్దు చేసుకోవచ్చు. ఇలా ఈ Hyde చట్టం లోని సెక్షన్ 103, 104, D2 మొదలైనవి భారతదేశానికి ఇబ్బంది కలిగించే అంశాలు. “ చట్టంలో అలా వుంది గానీ నేను ఆ అధికారాన్ని వినియోగించను ” అని జార్జి బుష్ గారు అంటున్నారు.
మన దేశ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు కూడా ఈ అణు ఒప్పందం బాగానేవుంది అన్నారు. కానీ మనదేశ అణుశాస్త్రవేత్తలు ఈ ఒప్పందాన్ని తిరస్కరించారు. ప్రస్తుతం మైనారిటీగావున్న కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఆమోదం పొందకుండా భారతదేశ సార్వభౌమాధికారాన్ని మరోసారి తెల్లవానికి తాకట్టుపెట్టడం మంచిదంటారా?
నాకు తెలిసినంతవరకూ అమెరికా పాకీస్థాన్ వైపూ, రష్యా ఇండియా వైపూ ఉండేవి. ఇండియా అలీనదేశాలకు నాయకత్వం వహిస్తుంది.ఇప్పుడు అమెరికా మన విద్యుత్ అవసరాలను కోసం అణువిద్యుత్తు తయారుచేసుకునే పరిజ్ఞానాన్ని మనకు ఇవ్వడానికి తహతహ లాడుతుంది. ఎందుకు?
ఈ అణు ఒప్పందం అమలు 4 దశలుగా జరగాలి. 1.అణుఇంధనాన్ని సప్లై చేసే గ్రూపు ( NSG ) మన దేశంతో చర్చించి అంగీకారం తెల్పాలి. 2.అంతర్జాతీయ అణు సంస్ధ ( IAEA ) ) మన దేశంతో చర్చించి అంగీకారం తెల్పాలి. ( ఇప్పుడు జరగబోయే సీను ఇదే.)3. భారతదేశ కేంద్ర ప్రభుత్వం అమెరికా షరతులకు అంగీకరించాలి. 4. పై మూడు ఒప్పందాలను పరిశీలించాక అమెరికా పార్లమెంటు అంగీకరించి చట్టం చెయ్యాలి.
ఇప్పటివరకూ 25 దేశాలతో అమెరికాకు అణు ఒప్పందం కుదిరింది. వాటిల్లో కమ్యూనిష్టులు అభిమానించే చైనా దేశం కూడా ఉంది. మరి కమ్యూనిష్టులు ఈ అణు ఒప్పందాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఎందుకంటే ఆ 25 పెద్దదేశాలు సంతకాలు చేసి అంగీకారం తెల్పిన తర్వాత 2007లో Hyde చట్టాన్ని అమెరికా తయారుచేసి అమెరికా కాంగ్రెస్ లోని రెండు సభలూ ఆమోదించింనాయి, అమెరికా ప్రసిడెంటు జార్జి బుష్, కూడా సంతకం చేసాడు. దానికంటే ముందు 2005 జూలై నెలలో మన ప్రధాని అమెరికా పర్యటనకు వెళ్ళినప్పుడు ఈ అణు ఒప్పందం విషయం బుష్ ప్రతిపాదించాడు. 2006 మార్చి లో ఢిల్లీలో భారత ప్రధాని మనమోహన్ సింగ్, అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ పౌర అణు సహకార ఒప్పందంపై సంతకాలు చేశారు. మనం చాలా ఆనందించాం, ఆశ్చర్యపోయాం ఎందుకు ఆయాచితంగా ఈ వరాన్ని ప్రసాదిస్తున్నారా అని. తర్వాత తెల్సిందేమిటంటే ఇరాన్ దేశం నుండి పాకీస్థాన్ , ఇండియా మీదుగా చైనా దేశానికి గ్యాసు పైపు లైను నిర్మించి , తక్కువ ధరకు గ్యాసు మనకు లభించేలాగా, తక్కువ ఖర్చుతో మనం విద్యుత్తు ఉత్పత్తి చేసుకోగలిగేలాగా చైనా, పాకీస్థాన్ , ఇరాన్ లతో మనం ఒక ఒప్పందం చేసుకొని ఉన్నాం. ఈ ఒప్పందాన్ని చెడగొట్టాలని అమెరికా ఎత్తుగడ పన్నింది. పాకీస్థాన్ ఎటూ అమెరికా మాట కాదనదు, మరి మనల్ని ఒప్పించాలంటే ఈ ఉచిత అణువిజ్ఞానబదలాయింపు అనే అస్త్రం ద్వారా మనల్ని పడగొట్టింది. ఇరాన్ దేశానికి వ్యతిరేకంగా మనచేత ఐక్యరాజ్యసమితిలో ఓటు వేయించింది. వెనుకబడిన దేశాలతోఒప్పందంగా భావించి, Hyde చట్టాన్ని దీనితో జతచేశారు.Hyde చట్టం ప్రకారం మనం ఇతర దేశాలతో చర్చలు జరపాలంటే అమెరికా అధ్యక్షుని అనుమతి తీసుకోవాలి. అమెరికా అధ్యక్షుడు ఏసమయంలో అయినా తన ఒప్పందాన్ని రద్దు చేసుకోవచ్చు. ఇలా ఈ Hyde చట్టం లోని సెక్షన్ 103, 104, D2 మొదలైనవి భారతదేశానికి ఇబ్బంది కలిగించే అంశాలు. “ చట్టంలో అలా వుంది గానీ నేను ఆ అధికారాన్ని వినియోగించను ” అని జార్జి బుష్ గారు అంటున్నారు.
మన దేశ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు కూడా ఈ అణు ఒప్పందం బాగానేవుంది అన్నారు. కానీ మనదేశ అణుశాస్త్రవేత్తలు ఈ ఒప్పందాన్ని తిరస్కరించారు. ప్రస్తుతం మైనారిటీగావున్న కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఆమోదం పొందకుండా భారతదేశ సార్వభౌమాధికారాన్ని మరోసారి తెల్లవానికి తాకట్టుపెట్టడం మంచిదంటారా?